Tuesday, April 23, 2024

తల్లి, కూతుర్ల దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి : తల్లి ,కూతుర్ల దారుణ హత్యకు గురైన ఘటన భూపాలపల్లిలో  చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేషాలపల్లి గ్రామానికి చెందిన  ఎలకంటి.రమణాచారి తన భార్య ఎలకంటి రమ(38), కూతురు ఎలకంటి చందన(17)ను గొడ్డలి కిరాతకంగా నరికివేశాడు.

అదే సమయంలో అతని చిన్న కొడుకుని చంపే ప్రయత్నం చేయగా అతను ఇంటి నుంచి పారిపోతుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడుని రిమాండ్ కి తరలించారు.  కుటుంబ కలహాలతో భార్యతో పాటు కూతురిని చంపినట్లు నిందితుడు పోలీసుల ఎదుట తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News