Friday, April 19, 2024

తిరుమల పరకామణిలో చోరికి యత్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తిరుమలలోని నూతన పరకామణి మండపంలో కట్టుబదిట్టమైన భద్రాతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఒక వ్యక్తి పరకామణి చోరికి ప్రయత్నించి పట్టుబడ్డాడు. ఆదివారం ఈ ఘటన జరిగింది. నోట్ల లెక్కింపు సమయంలో కొన్ని విదేశీ నోట్లను మలమార్గం వద్ద ఉంచుకుని బయటకు వెళుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని సిసి కెమరాల ద్వారా గుర్తించిన విజిలెన్స్ అధికారులు ఆ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలు నిర్వహించి నోట్లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు చోరీకి ప్రయత్నించిన ఆ ఉద్యోగిపైన కేసు నమోదు చేశారు.

నూతన పరకామణి మండపంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం, అడుగడుగునా సిసి కెమెరాల నిఘా వుంచడంతో ప్రతి ఒక్కరి కదలికపైనా సూక్ష్మ నిఘా ఉంచుతున్నారు.గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే గుర్తించే వెసులుబాటు లేదు. నూతన పరకామణి మండపంలో అధునాతన సాంకేతిక పరిజ్ణానంతో కూడిన భద్రత ఏరాట్లు చేశారు. దీంతో స్వామి సేవకోసం వచ్చి , చోరికి పాల్పడుతున్నవారిని వెంటనే గుర్తించగలుగుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతుందని భద్రతాధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News