Friday, March 29, 2024

నితిన్ స్థాయిని పెంచే చిత్రం

- Advertisement -
- Advertisement -

యూత్ స్టార్ నితిన్, క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్‌లో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘చెక్’. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈనెల 10 నుండి హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వి.ఆనందప్రసాద్ మాట్లాడుతూ.. “చెక్ టైటిల్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. నటుడిగా నితిన్ స్థాయిని పెంచే చిత్రమిది. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చదరంగం నేపథ్యంలో చాలా విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, సాయిచంద్, సంపత్ రాజ్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. నవంబర్ 5 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. దీంతో దాదాపుగా సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది” అని తెలిపారు. పోసాని కృష్ణ మురళి, మురశీ శర్మ, హర్షవర్ధన్, రోహిత్, సిమ్రాన్ చౌదరి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.

Nithin Check movie shooting in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News