Wednesday, April 24, 2024

ప్రశాంతంగా టిఎస్ పాలిసెట్ పరీక్ష

- Advertisement -
- Advertisement -

ప్రశాంతంగా టిఎస్ పాలిసెట్ పరీక్ష
92.94 శాతం మంది విద్యార్థులు హాజరు
మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాల్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టిఎస్ పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రవేశ పరీక్షకు 92. 94 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది.

రాష్ట్ర వ్యాప్తంగా 296 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పాలీసెట్ ప్రవేశ పరీక్షకు 58, 520 మంది బాలురు, 47, 222 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారు. 54, 700 మంది బాలురు, 43, 573 మంది బాలికలు పరీక్షకు హాజరయ్యారు. మొత్తంగా 1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా 98, 273 మంది హాజరైనట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి డాక్టర్. సి. శ్రీనాథ్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News