Friday, March 29, 2024

బర్డ్ ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సౌకర్యాలు, వైద్య సేవలు : టీటీడీ జేఈవో సదా భార్గవి

- Advertisement -
- Advertisement -

 

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మీద విశ్వాసంతో బర్డ్ ఆసుపత్రికి వచ్చే రోగులకు మరింత మెరుగైన వసతులు, వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. బర్డ్ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు అందుతున్న సదుపాయాలు, వైద్య సేవలు, శస్త్ర చికిత్సలను గురువారం ఆమె పరిశీలించారు. ఆసుపత్రి ముందు, వెనుక ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.


ఆసుపత్రి ఎదురుగా వాహనాల పార్కింగ్ క్రమ పద్ధతిలో ఉండేలా ఏర్పాటు చేయాలని విజిలెన్స్ అధికారులకు చెప్పారు. అత్యవసర వార్డు, జనరల్ వార్డు, ఎక్స్ రే, స్కానింగ్, ఓపి వార్డులను ఆమె పరిశీలించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, అన్న ప్రసాదాల నాణ్యత గురించి రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి కొత్త బ్లాక్ లో కేఫ్తెరియా, పాత బ్లాక్ వద్ద ఖాళీ స్థలంలో రోగులు వారి సహాయకుల కోసం క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జేఈవో సూచించారు.
ఆసుపత్రి లోని కారిడార్లు, వార్డుల ఆవరణం అందంగా తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న సామగ్రి డిపిడబ్ల్యు స్టోర్ కు తరలించాలని ఆదేశించారు. కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆమె సూచించారు.

రోగి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు వారికి చేసిన వివిధ రకాలపరీక్షలు, అందించిన వైద్యం లాంటి మొత్తం వివరాలు కంప్యూటరైజ్ చేయాలని ఆమె ఆదేశించారు. ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్, సి ఎస్ ఆర్ ఎంవో డాక్టర్ కిషోర్, ఈ ఈ శ్రీ కృష్ణారెడ్డి, డి ఈ శ్రీమతి సరస్వతి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News