Friday, March 29, 2024

బాలుడిపై గంజాయి బ్యాచ్ దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గంజాయి మత్తులో బాలుడిపై దాడి చేసిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. గంజాయికి డబ్బులు ఇవ్వాలని బాలుడిని డిమాండ్ చేస్తూ బట్టలు విప్పి బెల్ట్, కర్రలతో తీవ్రంగా కొట్టి చిత్రహింసలు పెట్టారు. పోలీసుల కథనం ప్రకారం…కిరాణా షాపులో కూర్చున్న బాలుడిని బలవంతంగా సమీపంలోని గుట్టల వద్దకు తీసుకుని వెళ్లారు. గంజాయికి డబ్బులు ఇవ్వాలని బాలుడి బట్టలు విప్పి బెల్టు, కర్రలతో తీవ్రంగా కొడుతూ చిత్రహింసలు పెట్టారు.

గంజాయి బ్యాచ్ నుంచి తప్పించుకున్న బాలుడు ఇంటికి చేరుకున్నాడు. నీకు దిక్కున్న చోట చెప్పుకో ఇప్పటికే ఇద్దరిని హత్య చేశాం అని గ్యాంగ్ సభ్యులు బాలుడిని బెదిరించినట్లు తెలిసింది. బాలుడి ఒంటిపై గాయాలు చూసిన బాలుడి తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహ్మద్ సైఫ్, అబ్బూ, సమీర్‌తోపాటు మరో ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News