- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : బాసర సరస్వతీ అమ్మవారికి దేవాదాయ, అటవీ, పర్యావరణ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించారు. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కుటుంబసమేతంగా బుధవారం అమ్మవారిని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి దర్శించుకున్నారు. మంత్రి దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారికి తీర్థప్రసాదాలతో పాటు అమ్మవారి ఆశీస్సులను అందించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి గురించి మంత్రి ఆలయ అధికారులతో చర్చించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే విఠల్రెడ్డి, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస్రావు, ఈఓ వినోద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -