Thursday, March 28, 2024

మోడీ సర్టిఫికెట్లపై పేచీ

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భంగపాటు ఎదురైంది. ఈ అంశం పై గుజరాత్ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ప్రధాని డిగ్రీ, పిజి పత్రాలను చూపించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పిం ది. ఈ మేరకు ఏడేళ్ల క్రితం కేంద్ర సమాచార క మిషన్( సిఐసి) ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసిన న్యా యస్థానం కేజ్రీవాల్‌కు రూ.25వేలు జరిమానా విధించింది. ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలపై ఆరోపణలు చేస్తున్న కేజ్రీవాల్ ఆయన డిగ్రీ, పిజి సర్టిఫికెట్ల కోసం 2016లో సమాచార హక్కు చట్ంట ద్వారా కేంద్ర సమాచార కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన సిఐసి… మోడీ డిగ్రీ, పిజి సర్టిఫికెట్లను చూపించాలం టూ పిఎంఒ కార్యాల యం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌ను, గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీల పిఐఒలను 2016 ఏప్రిల్‌లో ఆదేశించింది. అయితే మూడు నెలల తర్వాత సిఐసి ఉత్తర్వులను సవాలు చేస్తూ గుజరాత్ యూనివర్సిటీ హైకోరును ఆశ్రయించింది.

దీంతో సిఐసి ఆదేశాలపై అప్పట్లో హైకోర్టు స్టే విధించింది. ఇటీవలే ఈ కేసు తెరమీదికి వచ్చింది. దీనిపై గత నెల హైకోర్టులో విచారణ జరిగింది. గుజరాత్ యూనివర్సిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.‘ మోడీ విద్యార్హతల ను దాచి పెట్టాల్సిన అవసరం లేదు. ఆ వివరాలు ఇప్పటికే పబ్లిక్ డొమైన్‌లో, యూనివర్సటీ వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రజాస్వామ్యంలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి డాక్టరేట్ అయినా, నిరక్షరాస్యుడైనా పెద్ద తేడా ఉం డదు. అంతేకాక ఈ వివరాలను ప్రత్యేకంగా బైటపెట్టడంలో ప్రజాప్రయోజనం ఏమీ లేదు. ఇక ప్రధాని వ్యక్తిగత గోప్యతపై ఇది ప్రభావం చూపుతుంది. ఓ వ్యక్తి బాధ్యతారహితమైన అత్యుత్సాహానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని మెహతా వాదించారు. అయితే ఈ వాదనలను కేజ్రీవాల్ తరఫు నాయవాది ఖండించారు.

ఆ పత్రాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో లేవని, ఆధారాల కోసమే వాటి కాపీలను అడుగుతున్నామన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. మోడీ సర్టిఫికెట్లను పిఎంఓ కానీ యూనివర్సిటీ కానీ చూపించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా ఆ పత్రాలను కోరిన కేజ్రీవాల్‌కు రూ.25 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా గుజరాత్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News