Saturday, April 20, 2024

లారీ బీభత్సం: బాలుడి పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

విజయవాడ: ఓ లారీ బీభత్సం సృష్టించిన ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన విజయవాడ లో ఇవాళ చోటు చేసుకుంది . వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. మామిడి కాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బ్రిడ్జి కింద ఉన్న ఇళ్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన విజయవాడలోని బెంజిల్ సర్కిల్ వద్ధ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ఒక్కసారిగా లారీ ఇళ్లపైకి వెళ్లడంతో లారీ లోంచి మామిడి కాయలు బాలుడిపై పడ్డాయి. దీంతో స్థానికులు గమనించి బాలుడు ని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన బాలుడుని స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News