Thursday, April 25, 2024

సుపారీ ఎవరు ఇచ్చారు మోడీ: కపిల్ సిబాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తన పతనానికి కొందరు సుపారీ ఇచ్చారని, తన ఇమేజ్ ను దెబ్బతీసేందుకు కొందరు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల వ్యాఖ్యానించారు. తన సమాధి కట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి వారికి దేశం లోపల కొందరు, దేశం వెలుపల కొందరు మద్దతు ఇస్తున్నారని కూడా ఆరోపించారు. దీనిపై ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ స్పందించారు.

సుపారీ ఇచ్చిన వ్యక్తుల పేర్లు బయటపెట్టాలని మోడీని కోరారు. పేర్లు వెల్లడిస్తే వారిపై చర్యలు తీసుకునే వీలుంటుందని అన్నారు. వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, విదేశాలు కానీ… వీరిలో ఎవరో చెప్పండి… ఇది దేశ రహస్యంగా మిగిలిపోకూడదు… తప్పకుండా విచారిద్దాం అని కపిల్ సిబాల్ వ్యాఖ్యానించారు.

భారత్ లో ప్రజాస్వామ్య మనుగడ కష్టంగా మారిందని, దేశంలో దళితులు ద్వితీయ శ్రేణి పౌరుల్లా మారిపోయారని రాహుల్ గాంధీ ఇటీవల కేంబ్రిడ్జి ప్రసంగంలో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ‘మోడీ ఇంటి పేరు’ వ్యాఖ్యల కేసులో శిక్ష పడడంతో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై వేటు పడింది. ఈ పరిణామాలను గమనిస్తున్నామంటూ జర్మనీ, బ్రిటన్ దేశాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News