Friday, April 19, 2024

రాణా, రాహుల్‌ మెరుపులు.. సన్‌రైజర్స్ లక్ష్యం 188

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. ఓపెనర్ నితీశ్‌ రాణా(80; 56 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సర్లు), రాహుల్‌ త్రిపాఠి(53; 29 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో చేలరేగారు. చివర్లలో దినేష్ కార్తిక్(22; 9 బంతుల్లో 2ఫోర్లు, ఒక సిక్స్) రాణించడంతో కోల్‌కతా భారీ స్కోరు సాధించింది. దీంతో సన్‌రైజర్స్ జట్టుకు కోల్‌కతా 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రైజర్స్‌ బౌలర్లలో సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌(1/45), సందీప్‌ శర్మ(0/35) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. రషీద్‌ ఖాన్‌(2/24), మహ్మద్‌ నబీ(2/32) కోల్‌కతాను కొంతమేరకు కట్టడి చేశారు.

‌ IPL 2021: KKR Sets up 188 runs target against SRH

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News