Friday, March 29, 2024

వరంగల్‌ పర్యటనలో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌కు కెటిఆర్ శంకుస్థాప‌న‌

- Advertisement -
- Advertisement -

వ‌రంగ‌ల్ జిల్లాలో రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కెటిఆర్ డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనుల‌కు శంకుస్థాప‌న చేశారు. సోమవారం వరంగల్ లో మంత్రి కెటిఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాంపూర్ గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన మిష‌న్ భ‌గీర‌థ వాట‌ర్ ట్యాంక్‌ను ప్రారంభం చేశారు. అనంతరం జర్నలిస్టుల కోసం రూ.10.60 కోట్లతో నిర్మించనున్న 200 డబుల్ బెడ్రూం ఇండ్ల పనులకు మంత్రి శంకుస్థాప‌న చేశారు. ఈ పర్యటనలో మంత్రి కెటిఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, పలువురు ఎంఎల్ఎలతో పాటు‌ తదితరులు ఉన్నారు.

‌KTR lays foundation stone to double houses in Warangal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News