- Advertisement -
మన తెలంగాణ/భూదాన్పోచంపల్లి: నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని ధర్మారెడ్డిపల్లి గ్రామంలో అగ్రిప్రమాదంలో మేకలు, కోళ్లు సజీవదహనమయ్యాయి. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… బిజిలి అంజయ్య అనే రైతుకు చెందిన మేకల కొట్టంలో విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చేలరేగడంతో 10 మేకలు, 25 కోళ్లు అగ్నికి అహుతయ్యాయి. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోచంపల్లి ఎస్ఐ రాజు తెలిపారు. లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం ప్రభుత్వమే అంజయ్య ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
10 Goats die in Fire accident in BhoodanPochampally
- Advertisement -