- Advertisement -
మద్దిరాల: సూర్యాపేట జిల్లాలోని మద్దిరాల మండలం ఎర్రపాడు కూడలి వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లారీని ఓ వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యానులో ప్రయాణిస్తున్న పదిమంది గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. వ్యాను నకిరేకల్ కు పెళ్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని బాధితులు చెబుతున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
10 Injured in Road Accident At Suryapet
- Advertisement -