Tuesday, April 23, 2024

ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. పదిమంది ప్రాణాలు తీసింది

- Advertisement -
- Advertisement -

tractor-Accident

అమరావతి: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం పదిమంది కూలీల ప్రాణం తీసింది. మాచవరంలో కూలీలతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో 11కె.వి విద్యుత్ వైర్లు ట్రాక్టర్ పై పడ్డాయి. ఈ ప్రమాదంలో 10మంది అక్కడికక్కడే మృత్యువాత పడగా… ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు.

మృతుల్లో ఏడుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన ఎపి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ప్రకటించింది. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మాచవరం నుంచి రాపర్లకు మిర్చి కోతకు వెళ్లిన కూలీలు తిరుగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

10 workers death as tractor hits electric pole

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News