Saturday, April 20, 2024

100 పడకల కోవిడ్ వార్డును ప్రారంభించిన మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

100 Bed COVID Ward Inaugurated by Minister Harish Rao

సిద్దిపేట: జిల్లాలోని ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రిలో 100 పడకల కోవిడ్-19 వార్డులను తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్, ఎఫ్ డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ… కష్టకాలంలో ఆర్వీఎం ఆసుపత్రి ముందుకు వచ్చి కరోనా పేషంట్లకు సేవచేస్తామనడం గొప్పవిషయమని మంత్రి హరీష్ అన్నారు. ఆసుపత్రుల్లో 4వతరగతి కేటగిరీలో పనిచేస్తూ సేవలందిస్తున్న స్వీపర్లు, నర్సులకు తెలంగాణ ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు.

సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్వీఎం ఆసుపత్రిలో ఐసిఎంఆర్ అనుమతితో కొవిడ్ టెస్టింగ్ సెంటర్లు ప్రారంభించారు. కరోనా వచ్చిన వారు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ఎలాంటి అనుమానం ఉన్నా గజ్వేల్, సిద్దిపేటలో పరీక్షలు చేస్తున్నారని వివరించారు. అన్నీ పిహెచ్ సీల్లో రాపిడ్ టెస్టులు చేస్తున్నారన్నారు. కరోనా పేషంట్లు ఎంత మంది వచ్చిన చికిత్స చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. వ్యాధి లక్షణాలు కొద్దిగా ఉన్నా ఆసుపత్రికి వచ్చి ప్రభుత్వానికి సహకరించండి అన్న మంత్రి కరోనా కష్ట కాలంలో కృషి చేస్తున్న పోలీసులు, వైద్యులకు సహకరిద్దామని పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News