- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 62,225 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 10,199 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు, 75 మరణాలు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 4లక్షల 65,730కి చేరాయి. ఇప్పటివరకు మొత్తం 4200 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,03,701 యాక్టివ్ కేసులుండగా.. 3లక్షల 57, 829 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24గంటల్లో 9,499 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఎపిలో ఇప్పటివరకు 39లక్షల 5,775 మందికి కరోనా టెస్టులు చేసినట్టు వైద్యాధికారులు పేర్కొన్నారు.
- Advertisement -