- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,085 కొత్త కోవిడ్ కేసులు, ఎనిమిది మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 1,447 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,63,843కి చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 6,956 మంది మృతిచెందారు. ఆంధ్రలో ఇప్పటివరకు 8.43లక్షల మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 13,024 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఎపిలో గత 24గంటల వ్యవధిలో 65,101 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా… మొత్తం ఇప్పటివరకు 97.27లక్షల మందికి కరోనా టెస్టులు చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.
1085 new Covid-19 cases reported in Andhra Pradesh
- Advertisement -