Tuesday, April 16, 2024

చెట్టుకు ఉరివేసుకుని పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అచ్చంపేట శివారులోని పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఆకాష్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం పాఠశాల పక్కనే ఉన్న వ్యవసాయ పొలంలో ఆకాష్ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. విద్యార్థి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విద్యార్థి మరణంతో పాఠశాలలో, పట్టణంలో విషాదం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News