- Advertisement -
ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
వడోదర: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు, లారీ పరస్పరం ఢీకొన్న ఘటనలో 11మంది మృతి చెందగా, 16మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున వడోదర శివారులోని వాగోడియా క్రాస్రోడ్డు సమీపంలోని వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినపుడు ట్రక్కులో 27మంది యాత్రికులు ఉన్నారు. వీరంతా సూరత్ ప్రాంతం నుంచి పావగఢ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం పట్ల ప్రధాని మోడీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్రూపానీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
- Advertisement -