Thursday, April 25, 2024

పెబ్బేర్ బైపాస్ రోడ్డులో ప్రమాదం: 11మందికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

11 Injured in Road Accident in Wanaparthy

వనపర్తి: జిల్లాలోని పెబ్బేర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం పెబ్బేర్ నుంచి కర్నూలు వెళ్లే బైపాస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 11మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

11 Injured in Road Accident in Wanaparthy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News