Saturday, April 20, 2024

మాంటినిగ్రో దేశంలో కాల్పులు: 11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

11 Killed In Montenegro Shooting

 

సెంటింజో: మాంటినిగ్రో దేశంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 11 మంది దుర్మరణం చెందారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుటుంబ సభ్యులతో గొడవపెట్టుకొని బయటకు వచ్చాడు. అనంతరం తుపాకీతో వీధుల్లో కనిపించిన వారిపై దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పుల్లో 11 మంది ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని దుండగుడిని కాల్చి చంపారు. పోడ్ గోరిసాయ ప్రాంతానికి 36 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News