- Advertisement -
కాబూల్: ఉత్తర అఫ్ఘానిస్థాన్లో తాలిబన్లు జరిపిన ఆత్మాహుతి దాడిలో కనీసం 11మంది మృతి చెందినట్టు ఆ దేశ అధికారులు తెలిపారు. సమంగన్ రాష్ట్ర రాజధాని అయ్బర్లోని నిఘా కార్యాలయం లక్షంగా సోమవారం ఈ కారుబాంబు దాడి జరిగినట్టు వారు తెలిపారు. పేలుడు శబ్దాలు కిలోమీటర్లమేర వినిపించాయన్నారు. చుట్టుపక్కల పలు భవనాలు నేలమట్టమయ్యాయని, మరో 63మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తాలిబన్లు మృతి చెందినట్టు వారు తెలిపారు. గాయపడినవారిలో పౌరులు, చిన్నారులు ఉన్నారని వారు తెలిపారు. దాడికి పాల్పడింది తామేనని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు.
11 killed in Taliban Attack in Afghanistan
- Advertisement -