Wednesday, April 24, 2024

హెలికాప్టర్ ప్రమాదం…. 11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

11 Members dead in Helicopter accident

 

ఇస్తాంబుల్: టర్కీలోని ప్రావిన్సులో శుక్రవారం ఉదయం హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలడంతో 11 మంది మృత్యువాపడ్డారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో జనరల్ ఉస్మాన్ ఎర్బాస్ కూడా ఉన్నాడు. పర్వత ప్రాంతాలలో దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఉస్మాన్ ఎర్బాస్ మృతిపట్ల టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. 2017 హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది సైనికులు వీరమరణం పొందారు. 1997వ సంవత్సరంలో ఉత్తర ఇరాక్ లో పికెకె మిలిటెంట్లు దాడిలో 11 మంది టర్కీ సైనికులు చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News