Saturday, April 20, 2024

ఎపిలో కొత్తగా 117 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

163 New Corona Cases Registered In Telangana

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. గడచిన ఒక్క రోజులో కొత్తగా 117 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించింది. గత 24 గంటల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని తెలిపింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 8,89,916కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనాతో 7,169 మంది బాధితులు చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 718 యాక్టివ్‌ కేసులున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 66 మంది కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి 8,82029 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

117 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News