Friday, April 19, 2024

ఎపిలో 1,174 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1174 new covid cases reported in Andhra Pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24గంటల్లో 55, 525 శాంపిల్స్ పరీక్షించగా 1174 మందికి పాజిటివ్‌గా తేలింది. కరోనాతో చికిత్సపొందుతూ 9 మంది మృతి చెందారు. అలాగే గడచిన 24గంటలలో 1,309 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ ఒక బులెటిన్‌లో పేర్కొంది. ఈక్రమంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,37, 353 కు చేరగా 20,08, 639 మంది డిశ్చార్జ్ అయ్యారు.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 14, 061 కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14, 653 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News