Wednesday, April 24, 2024

తెలంగాణలో కొత్తగా 1,178 కేసులు.. 9మంది మృతి

- Advertisement -
- Advertisement -

1178 New Corona Cases Reported in Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో రోజురోజుకు మహమ్మారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 33వేలకు పైగా చేరుకుంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.  శనివారం కొత్తగా 1,178 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 9మంది చనిపోయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 33,402కు చేరింది. ఇక కరోనాతో 348 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 12,135 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి 20,919 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

1178 New Corona Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News