Sunday, June 15, 2025

తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారి ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్ మెంట్లు నిండి, శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో వెంకన్న సర్వ దర్శనానికి టోకెన్ పొందిన భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. ఆదివారం 90,802 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 35,776 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ. 3.73 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News