మేడ్చల్: ప్రపంచ పిల్లల దినోత్సవం రోజున 12 ఏళ్ల బాలికను ఓ యువకుడు పెళ్లి చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మండలం కండ్లకోయ గ్రామంలో జరిగింది. పోలీసలు పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి యువకుడిని, పూజారిని, పెళ్లి పెద్దలను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాజు అనే యువకుడు దినసరి కూలీగా పని చేసేవాడు. ఇంటికి సమీపంలో ఉన్న ఆరో తరగతి చదువుతున్న బాలికకు మాయమాటాలు చెప్పి ప్రేమలోకి దించడమే కాకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. జూన్ 1న మాధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మాతా దేవలయంలో బాలికను వివాహం చేసుకున్నాడు. వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలల హక్కుల సంఘం బాలానగర్ సిపి పద్మాజ రెడ్డికి ఫిర్యాదు చేసింది. పోలీసులు పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కండ్లకోయ ప్రాంతానికి చెందిన అంగన్ వాడి కార్యకర్త, సూపర్ వైజర్ ను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా పెళ్లి పెద్దలతోపాటు పూజారిని కూడా అరెస్టు చేశారు.