Sunday, December 3, 2023

మందు బాబులకు జరిమానా

- Advertisement -
- Advertisement -

12000 fine in drunk and drive

 

మన తెలంగాణ / సిద్దిపేట రూరల్: మద్యం సేవించి వాహనాలు నడిపిన 05 మందికి రూ.12 వేల జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండు, మూడు రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్, ఎంపిడిఓ చౌరస్తా, రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా 05 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్‌తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా సిద్దిపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి రమేశ్‌బాబు ముందు హాజరుపరుచగా విచారణ చేసి 05 మందికి రూ. 12 వేల జరిమానా విధించారు. మద్యంసేవించి వాహనాలు నడపవద్దని, రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలన్నారు. ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఆర్‌ఎస్‌ఐ శ్రీదర్‌రెడ్డి, ట్రాఫిక్ ఎస్‌ఐ షకిల్ హైమద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News