- Advertisement -
చెన్నై: తమిళనాడులో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,286 కొత్త కేసులు నమోదు అయ్యాయని, మరో 11 మంది కరోనా మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 25,872కు చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు 208 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక, కరోనా నుంచి 14,316 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 11,345 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
1286 New Corona Cases Reported in Tamil Nadu
- Advertisement -