Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 12,899 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

12,899 new corona cases in India

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 12,899 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,32,96,692కు చేరాయి. ఇందులో 4,26,99,363 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,855 మంది మృతిచెందారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసులు 72,474కు చేరాయి. కాగా, శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 15 మంది మహమ్మారికి బలవగా, 8,518 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇక మొత్తం కేసుల్లో 0.17 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News