Wednesday, April 24, 2024

కామారెడ్డి వద్ద బస్సు బోల్తా: 13 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

13 injured as Kamareddy RTC bus overturns

 

13 మందికి గాయాలు, నలుగురు విషమం

మన తెలంగాణ/కామారెడ్డి: మహారాష్ట్ర నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్‌టిసి బస్సు ఆదివారం తెల్లవారు జామున కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని శివారులో 44వ జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో 13 మందికి గాయాలు కాగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం డ్రైవర్ అతివేగంగా బస్సు నడపడంతో ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు బోల్తాపడినట్లు స్థానికులు తెలిపారు. ఏది ఏమైనా డ్రైవర్ నిర్లక్షంగా బస్సును నడపడంతోనే ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు తెలిపారు.

బస్సులో మొత్తం 38 మంది ప్రయాణికులు ఉండగా 13 మందికి గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మిగతా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, స్థానికులు ,కామారెడ్డి డిపోకు చెందిన అధికారులు సైతం సహాయ సహకారాలు అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News