Friday, April 19, 2024

ఆర్టీసీ బస్సులు ఢీ: 13మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

13 injured in two rtc buses collided at khammam

ఖమ్మం : రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని జరిగిన రోడ్డుప్రమాదంలో 13 మందికి గాయాలైన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల దగ్గర శుక్రవారం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తక్షణమే ఖమ్మం సర్కార్ దవాఖానకు తరలించారు. వివరాల్లోకి వెళితే… తనికెళ్ల శివారులోని విజయ కాలేజీ సమయంలో ఎదురెదురుగా వచ్చిన మణుగూరు, సత్తుపల్లి డిపోకు చెందిన బస్సులు తనికెళ్ల దగ్గర ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న 13 మంది గాయపడ్డారు. బస్సులు ఒక్కసారిగా ఢీకొట్టుకోవడంతో అందులో ఉన్న ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

13 injured in two rtc buses collided at khammam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News