Thursday, April 18, 2024

దేశంలో భారీగా తగ్గిన పాజిటీవ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

13058 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,058 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇక, నిన్న ఒక్కరోజు కరోనాతో 164 మంది మృతిచెందారని తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా సోకినవారి సంఖ్య 3.40కోట్లకు చేరింది.గత 24 గంటల్లో కరోనా నుంచి 19,470 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు మొత్తం 3.34కోట్లకు పైగా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో దేశవ్యాప్తంగా 4,52,454మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1.83లక్షల మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 98.67కోట్లకు పూగా కరోనా డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ పేర్కొంది.

13058 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News