Thursday, April 25, 2024

0.4 శాతానికి చేరిన క్రియాశీల రేటు

- Advertisement -
- Advertisement -

13091 new covid-19 cases reported in india

న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 11,89,470 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, 13,091 కొత్త కేసులు బయటపడ్డాయి. బుధవారం కంటే 14 శాతం మేర కేసులు పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 340 మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం కేసులు 3.44 కోట్లకు చేరగా, 4.6 లక్షలకు పైగా మరణాలు నమోదయ్యాయని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులో ఉండడంతో క్రియాశీల కేసులు 1.4 లక్షల దిగువనే నమోదయ్యాయి. క్రియాశీల రేటు 0.40 శాతానికి చేరగా, రికవరీ రేటు 98.25 శాతంగా కొనసాగుతోంది. బుధవారం 13,878 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.38 కోట్లను దాటాయి. బుధవారం 57.54 లక్షల మంది కరోనా టీకా తీసుకున్నారు. దీంతో దేశంలో మొత్తం 110 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News