న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,451 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో 585 మంది మృతిచెందినట్లు తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42,15,653కు చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 4,55,653మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, గత 24 గంటల్లో 14,021మంది కరోనా నుంచి కోలుకోగా.. దేశంలో ఇప్పటివరకు 3,35,97,339 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,62,661 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 242 రోజుల్లో యాక్టివ్ కేసులు ఇంత తక్కువగా ఉండటం ఇదే మొదటిసారని ఆరోగ్యశాఖ పేర్కొన్నది.కాగా, దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 55,89,124 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని, ఇప్పటివరకు మొత్తం 1,03,53,25,577 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ తెలిపింది.
13451 New Corona Cases Reported in India