Thursday, April 25, 2024

ఎపిలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

135 Corona New Cases Registered in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. ఎపిలో గత 24 గంటల్లో 36,970 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 135 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ఒకరు మరణించగా, 82 మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 8,90,215 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి 7170 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో కరోనా నుంచి 8,82,219 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 826 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

135 Corona New Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News