Friday, March 29, 2024

రాష్ట్రంలో కొత్తగా 135 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

135 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 26,842 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 135 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆదివారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,70,274కు పెరిగింది. తాజాగా 168 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,62,377 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఒక్కరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,947కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.82 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,950 యాక్టివ్ కేసులున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News