Wednesday, April 24, 2024

ఎపిలో 10 వేలకు పైగానే కేసులు

- Advertisement -
- Advertisement -

13819 new Covid cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్య 10వేలకు పైగానే దాటుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 46,929 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 13,819 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఇద్దరు మృతి చెందగా, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.కరోనా నుంచి 5,716 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,01,396 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అత్యధికంగా విశాఖపట్నంలో 1,988 కేసులు నమోదు కాగా, ప్రకాశం 1,589, గుంటూరు 1,422, అనంతపురం 1,345, నెల్లూరు 1,305, కర్నూలు 1,255, కడప 1,083, తూర్పుగోదావరి 1,001 కేసులు నమోదయ్యాయి. కరోనాతో పోరాడుతూ ఇప్పటివరకూ 14,561 మంది మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News