Thursday, April 25, 2024

ఎపిలో కోటీ 27లక్షలు దాటిన కరోనా పరీక్షలు

- Advertisement -
- Advertisement -

139 New Covid-19 Cases Reported in Andhra Pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 49,483 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 139 మందికి కొత్తగా కోవిడ్-19 సోకింది. అదే సమయంలో మరో 254 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,557కి చేరింది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 7,142 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రవ్యాప్తంగా 8.77లక్షల మందికి పైగా బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ప్రస్తుతం 1,522 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఎపిలో కరోనా నిర్ధారణ పరీక్షలు కోటీ 27లక్షలు దాటాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News