- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోనే కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. తాజాగా నగరంలోని అంబర్ పేటలో 14మందికి కరోనా సోకింది. దీంతో వీరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రైమరీ కాంటాక్ట్ కేసులుగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3 వేలు దాటింది. కరోనాతో ఇప్పటివరకు 99 మంది ప్రాణాలు కోల్పోయారు.
14 members Tests Positive for Corona in Amberpet
- Advertisement -