మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా పరుగులు పెడుతుంది. మంగళవారం పహాడీషరీప్లోని మటన్ వ్యాపారి కుటుంబంలో 14మందికి పాజిటివ్ ఉన్నటు తేలింది. జియాగూడలోని బంధువుల ద్వారా సోకిన కరోనా అందులో గౌలిపురాకు చెందిన మరో ముగ్గురికి కూడా వైరస్ సోకినట్లు వైద్యులు పేర్కొన్నారు.వీరికి గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. అదే విధంగా శేరిలింగంపల్లి జోన్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.
ఒకే ఇంట్లో ఐదుగురికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. సాప్ట్వేర్ ఇంజనీర్ ఇంట్లో మరో నలుగురికి కరోనా పాజిటివ్గా తేలింది. సర్కిల్ పరిధిలో రెండు కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ సాప్ట్వేర్ ఇంజనీర్కు వైరస్ సోకగా అతని నుంచి భార్య(31), కొడుకు (3), బావమరిది (34), బావమరిది కూతుకు కరోనా సోకినట్లు తేలింది. దీంతో వారిని వెంటనే చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాజుల రామారంకు చెందిన గర్భిణీ ప్రవసం కోసం నిలోఫర్ ఆసుపత్రికి రావడంతో వైద్యులు పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. కానీ ఆమెకు ఎలాంటి లక్షణాలు లేకున్నా పాజిటీవ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.
14 Same family members test positive for Corona in Hyd