Friday, March 29, 2024

ఎపిలో కొత్తగా 141 కరోనా పాజిటివ్ కేసులు

- Advertisement -
- Advertisement -

141 new Corona cases in Andhra Pradesh

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు మరింత పెరిగాయి. గడిచిన 24గంటల్లో 9,986 మందికి పరీక్షలు నిర్వహించగా.. 141 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ లో తెలిపింది.  వీటిలో విదేశాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారే 43మంది ఉండగా… ఎపికి చెందిన 98మందికి కరోనా సోకింది. గత 24గంటల్లో కరోనా మహమ్మారి బారినపడి ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 71కి పెరిగింది. కొత్తగా బయటపడ్డ కేసుల్లో 19  కోయంబేడు లింకులేనని అధికారులు వెల్లడించింది. తాజా కేసులతో ఎపిలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 3,377కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1,033 యాక్టివ్ కేసులుండగా… 2,273 మంది బాధితులు ఈ వైరస్ తో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News