Saturday, April 20, 2024

రాష్ట్రంలో కొత్తగా 146 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -
146 new covid-19 cases reported in telangana
రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి కొవిడ్ పాజిటివ్

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 26,625 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 146 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. ఆదివారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,78,288కు పెరిగింది. తాజాగా 189 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,70,435 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 4,007కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.84 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,846 యాక్టివ్ కేసులున్నాయి. రిస్క్ దేశాల నుంచి ఆదివారం 791 మందికి నగరానికి రాగా, వారిలో ఒకరికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News