- Advertisement -
హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 14,986 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 84 మంది ప్రాణాలు కోల్పోయారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 13లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 8,791కి పెరిగింది.
14986 New Corona Cases Reported in AP
- Advertisement -