Friday, April 19, 2024

పడవ మునిగి 150 మంది మృతి

- Advertisement -
- Advertisement -

అబుజా: పడవ మునిగి 150 మంది మృతి చెందిన సంఘటన నైజీరియాలోని నైగర్ నదిలో జరిగింది. 180 మంది ప్రయాణీకులు నైజర్ రాష్ట్రం నుంచి వాయవ్య కెబ్బి రాష్ట్రానికి వెళ్తుండగా పడవ మునిగిపోవడంతో 150 మంది చనిపోయారు. పడవ సామార్ధ్యానికి మించి మనుషులు ఉండడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. 22 మందిని రక్షించామని మరో ఎనిమిది అపస్మారకస్థితిలో ఉన్నట్టు సమాచారం. పడవలో ఎక్కువ మంది ప్రయాణీకులు ఉండొచ్చని మరో 140 మంది ప్రయాణికులు గల్లంతైనట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News