- Advertisement -
న్యూఢిల్లీ : వాయిదా పడిన సిబిఎస్ఇ 10,12 తరగతుల బోర్డు పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 15,000 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు మానవ వనరుల అభివృద్ధిశాఖ(హెచ్ఆర్డి) మంత్రి రమేశ్పోఖ్రియాల్ తెలిపారు. జులై 1నుంచి15 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. మొదట 3000 కేంద్రాలలోనే నిర్వహించాలనుకోగా, భౌతిక దూరం నిబంధన మేరకు సంఖ్యను పెంచారు. తమ పేర్లు నమోదు చేసుకున్న చోటే పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్ఆర్డి తెలిపింది. కంటైన్మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు.
- Advertisement -