- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గడచిన 24గంటల్లో 33,226 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 151 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. ఈక్రమంలో కరోనా బారిన పడి చికిత్స పొందుతూ 24 గంటల్లో ఇద్దరు కరోనా బారినపడి మృతి చెందగా, 190 మంది కరోనా నుంచి కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3,838 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం 6,72,203 మంది కరోనా బారినపడగా.. 6,64,402 మంది కరోనా నుంచి కొలుకోగా 3,963 మంది కరోనాతో మరణించారు.
- Advertisement -