- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,554 కొత్త కోవిడ్ కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 1435 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,12,224కి చేరాయి. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 1,256 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి 1,94,653 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23,203 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 19,251 మంది బాధితులు హోంఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ లో 249, రంగారెడ్డిలో 128, మేడ్చల్ లో 118 కరోనా కేసులు బయటపడ్డాయి.
1554 New Covid 19 Cases Reported in Telangana
- Advertisement -